Conspiracy Viral Posts

తిరుమల కొండపై అన్యమత ప్రచారం అవాస్తవం

తిరుమల కొండపై అన్యమత ప్రచారం అవాస్తవం

తిరుమల కొండపై పాస్టర్లు అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఇందుకు ప్రభుత్వమే కారణమంటూ ఆరోపణలు చేసారు. అయితే ఈ సంఘటన జరిగింది అక్టోబర్ 2013 అని #FactCheckApGov తనిఖీబృందం గుర్తించింది.

దురుద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు ఫేక్ వార్తను ప్రచురించినట్టు నిర్థారించింది. మొండితోక సుధీర్ అనే వ్యక్తి 2013లో తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేస్తున్నవిషయాని ఒక టీవీ ఛానెల్ వెలుగులోకి తెచ్చింది.
Video News Link: https://www.youtube.com/watch?v=f4FR7IfuHBQ

దీని ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానం అతడిపై కేసు నమోదు చేయగా, అక్టోబర్ 2014 లో పోలీసులు దీనిపై విచారణ జరిపారు. అతడితోపాటు మరో నలుగురిని అరెస్టు చేసారు.
Action by Police: https://www.thehindu.com/news/national/andhra-pradesh/evangelist-sudhir-arrested-admits-to-offence/article6549272.ece

ఈ వివాదాస్పదమైన ట్వీట్లను పోలీస్ సైబర్ విభాగానికి పంపగా, పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.